నూటా
పాతిక కోట్ల భారతీయుల ఆశాకిరణం నరేంద్ర దామోదర దాస్ మోడీ. ప్రపంచంలోనే
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం పగ్గాలందుకున్న ఈ చాయ్ వాలా ముందు భారీ
లక్ష్యాలే ఉన్నాయి. భారత్ ను సూపర్ పవర్ గా తీర్చిదిద్దాల్సిన బృహత్తరమైన
బాధ్యత మొదటిది. స్వతంత్ర భారతదేశంలో ఓటర్లు స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టిన
తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఇదే. ఇప్పటిదాకా ఇండిపెండెన్స్ కు ముందు
పుట్టిన ప్రధానులను చూశాం. ఇప్పుడు 1947 తర్వాత అదీ ఇండియాలోనే జన్మించిన
మోడీని చూస్తున్నాం. గుజరాత్ మోడల్ తో ఆయన సొంత రాష్ట్రంలో ఏదో మహాద్భుతం
చేశారని జనం నమ్ముతున్నారు. అదే అభివృద్ధిని దేశమంతటికీ విస్తరిస్తారనీ
ఆశిస్తున్నారు.
No comments:
Post a Comment