ఓడలు బండ్లు... బండ్లు ఓడలు కావడమంటే
ఇదేనేమో! ఒకప్పుడు ఒక్క మెట్టు కూడా దిగని నటి త్రిష ఇక చేసేది లేక సెకండ్
హీరోయిన్ పాత్రకు ఓకే చెప్పేసింది. అజిత్ హీరోగా ప్రముఖ డెరెక్టర్ గౌతం
మీనన్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో అనుష్క ప్రధాన పాత్రలో కనిపిస్తుంది. తమిళ
ముద్దుగుమ్మ త్రిష రెండో కథానాయికగా ఉంటుంది. ఇంతకీ ఈ డీల్ ఎందుకు
ఒప్పుకుందంటే- త్వరలో గౌతమ్ మీనన్ తమిళ హీరో శింబుతో మరో ప్రాజెక్టు
మొదలెట్టబోతున్నారు. అందులో మెయిన్ హీరోయిన్ రోల్ త్రిషకే రిజర్వ్ చేశాడట.
గతంలో శింబు, త్రిష జంటగా ‘విన్నై తాండి వరువాయా’ మూవీ హిట్టయింది. దీంతో
శింబుతో చేసే ఛాన్సు కోసం అజిత్ సరసన సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు త్రిష
ఓకే అందిట!
No comments:
Post a Comment