Saturday 3 May 2014

చూపులు కలిపిన ఇంటర్వ్యూ


జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ చింతన్ బైఠక్ జరిగాక రాజ్యసభ టీవీ కోసం దిగ్విజయ్ సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చేసింది ఎవరో కాదు..! సీనియర్ జర్నలిస్టు అమృతా రాయ్. ఆనాడే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టిందని సమాచారం. ఇక ఆ తర్వాత చెట్టాపట్టాలేసుకుని తిరగడం కామనే. ప్రస్తుతం రాజ్యసభ టీవీలో ఉద్యోగం చేస్తున్న అమృతా రాయ్ ఏ మాత్రం వీలుచిక్కినా డిగ్గీతోనే గడుపుతున్నారని వినికిడి. నిరుడు డిగ్గీ మొదటి భార్య ఆశా సింగ్ మరణించారు. ఆమెకు చాలా సంవత్సరాలుగా క్యాన్సర్. ఆమె చనిపోయాక ఓసారి పూణెలోని ఆలయంలో దిగ్విజయ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పక్కనే తెల్లని చూడీదార్ వేసుకున్న ఓ అమ్మాయి కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఆ వీడియో ఇంటర్ నెట్ లో ప్రత్యక్షమయ్యాకే దిగ్విజయ్ సాగిస్తున్న లవ్ ఎఫైర్ పై ప్రత్యర్థుల ఆరా మొదలైంది. దీన్ని వెలుగులోకి తీసుకువచ్చింది సోషల్ మీడియా. ఆ తర్వాతే మెయిన్ స్ట్రీమ్ మీడియా హడావిడి మొదలెట్టింది. ఇంతకీ ఆ వైట్ డ్రైస్ భామ ఎవరన్న ప్రశ్నే- డిగ్గీ, అమృతా రాయ్ ఎఫైర్ ను బయటపెట్టింది.
అమృతారాయ్ బ్యాగ్రౌండేంటి..!
అమృతారాయ్ బ్యాగ్రౌండేంటి..! http://aptopnews.com/national-news/568-2014-05-02-10-37-03

No comments: