జైపూర్
లో కాంగ్రెస్ పార్టీ చింతన్ బైఠక్ జరిగాక రాజ్యసభ టీవీ కోసం దిగ్విజయ్
సింగ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ చేసింది ఎవరో కాదు..! సీనియర్
జర్నలిస్టు అమృతా రాయ్. ఆనాడే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టిందని సమాచారం. ఇక ఆ
తర్వాత చెట్టాపట్టాలేసుకుని తిరగడం కామనే. ప్రస్తుతం రాజ్యసభ టీవీలో
ఉద్యోగం చేస్తున్న అమృతా రాయ్ ఏ మాత్రం వీలుచిక్కినా డిగ్గీతోనే
గడుపుతున్నారని వినికిడి. నిరుడు డిగ్గీ మొదటి భార్య ఆశా సింగ్ మరణించారు.
ఆమెకు చాలా సంవత్సరాలుగా క్యాన్సర్. ఆమె చనిపోయాక ఓసారి పూణెలోని ఆలయంలో
దిగ్విజయ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన పక్కనే తెల్లని చూడీదార్ వేసుకున్న ఓ
అమ్మాయి కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఆ వీడియో ఇంటర్ నెట్
లో ప్రత్యక్షమయ్యాకే దిగ్విజయ్ సాగిస్తున్న లవ్ ఎఫైర్ పై ప్రత్యర్థుల ఆరా
మొదలైంది. దీన్ని వెలుగులోకి తీసుకువచ్చింది సోషల్ మీడియా. ఆ తర్వాతే
మెయిన్ స్ట్రీమ్ మీడియా హడావిడి మొదలెట్టింది. ఇంతకీ ఆ వైట్ డ్రైస్ భామ
ఎవరన్న ప్రశ్నే- డిగ్గీ, అమృతా రాయ్ ఎఫైర్ ను బయటపెట్టింది.
No comments:
Post a Comment