Thursday 28 March 2013

135 ఏళ్లు దర్జాగా బతికి...!

బతకడం తెలిసిన తెగ!

అస్సాం అడవుల్లో అరుదైన గిరిజన తెగకు చెందిన పూనాకొన్వర్ చనిపోయాడుట!. ఇందులో ఏముందనిపించవచ్చు. 135 ఏళ్లు దర్జాగా బతికిన గిరిపుత్రుడు. అంటే మన దేశంలో అత్యధిక వయసున్న మనిషి పూనాకొన్వరే. ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నదీ ముఖ్యమే. ఈ అడవి బిడ్డ చివరి రోజుల్లోనూ ఆరోగ్యంగానే బతికాడు. రెండేళ్ల క్రితం కంటిచూపు మందగించింది. వినికిడి శక్తి తగ్గింది. ఆనాటి వరకూ వృద్ధాప్యఛాయలేవీ కనిపించకుండా చలాకీగానే తిరిగేవాడు. తన పనులు తానే చేసుకునేవాడుట. ఈ వృద్ధుడికి ఓ ప్రత్యేకత ఉంది. అదే ప్రజాస్వామ్యం మీద గౌరవం. ఏనాడూ ఎన్నికల్లో ఓటేయకుండా ఉండలేదు. రెండేళ్ల క్రితం 2011 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న బాధ్యతాయుతమైన పౌరుడు. మనదేశంలో ఏ ఎన్నికల్లోనూ సగటున అరవై శాతం ఓట్లు కూడా పోలవని వ్యవస్థలో పూనాకొన్వర్ ఆదర్శప్రాయుడు కదా. 

 

పూనాకన్వర్ కన్నుమూశాడంటే అస్సాం బారిబంద పల్లె మొత్తం కన్నీరు పెట్టింది. మంచైనా చెడైనా అంతా 'కేశాయ్ ఖైతీ'(ఈ తెగ పూజించే దేవత. కాళికాదేవి అవతారమని విశ్వాసం) మహిమ అంటారు ఈ అడవి బిడ్డలు. పూనాకొన్వర్ తరచూ ప్రచారంలోకి వచ్చేవాడు. దేశంలో అత్యధిక వయస్కుడిగా ఈశాన్య రాష్ట్రాలకు చిరపరిచితుడే. అరవైల్లోనూ ఇరవైల్లా బతకడం తెలిసిన ఈ తెగ గురించి మరికొన్ని వివరాలు...

బతుకు తెలిసిన గిరిజనం

ఆరోగ్యంగా ఎక్కవకాలం బతకడమెలాగో ఈ గిరిజన తెగకు తెలిసిపోయింది. దీన్నే 'ఆయువు'పట్టు తెలియడం అనొచ్చేమో! అస్సాం, మేఘాలయ అడవుల్లో ఎక్కువగా నివసించే గిరిజన తెగ 'తివా లాలుంగ్'. వీరి సగటు ఆయు:ప్రమాణమే 90 ఏళ్లు. నలభైయాభై ఏళ్లకే బతుకుజీవుడా అంటున్న ఈ తరంలో ఆరోగ్యంగా శతాయువు వైపు అడుగులు వేయడం గొప్పే.

మనలాగే బియ్యం, గోధుమలు వీరికి ప్రధాన ఆహారం. చేపలు, మాంసం ఎక్కువగా తింటారు. రోజూ గంజి తాగుతారుట. కాలుష్యం లేని వనాల మధ్య... కల్మషం లేని  జనాల మధ్య ఎంతకాలమైనా ఆరోగ్యంగా గడిపేయవచ్చుననేది వీరి నమ్మకం. పూనాకన్వర్ 135 ఏళ్లు చలాకీగా బతికాడంటే ఇదే కారణం. ఆయన ముని మనవరాలి వయస్సే 68 ఏళ్లు. ఐదు తరాలను చూసిన ఈ శతాధిక వృద్ధుడి తరంలో మరకొంత మంది కూడా సెంచరీలు చేసే వయస్సుమాదీ అంటున్నారు. అవును బతకాలన్న కాంక్ష కూడా మనిషిని బతికిస్తుంది. అయితే ఆరోగ్యంగా బతికేందుకు మనవంతు ప్రయత్నం చేయాలి. పరిసరాలను మార్చుకోవాలి. మనమూ మారాలి.

శ్రమైక జీవన సౌందర్యం

 

No comments: