Thursday 28 March 2013

కాశ్మీరీ కన్నె సోయగం!

తులిప్ గార్డెన్స్ పుష్పవిలాసం

వసంతాగమనంతో కాశ్మీరీ కన్నెసోయగాలు  పులకరింపచేస్తున్నాయి. శ్రీనగర్ లో ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ గార్డెన్ను టూరిస్టుల కోసం తెరిచారు. సిరాజ్ బాగ్ గా ప్రసిద్ధి చెందిన తులిప్ గార్డన్స్ కు 2008లో ఇందిరాగాంధీ పేరుపెట్టారు. 

పదిహేను హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ భూలోక స్వర్గాన్ని చూసేందుకు నిలువెల్లా కనులున్నా చాలవు. హిమసరస్సులాంటి డాల్ లేక్ తీరాన ఉన్న ఈ సుందర ఉద్యానవనంలో సుమారు ఎనభై రకాల పుష్పాలు వసంత శోభను వెదజల్లుతున్నాయి. 


  తోట మొత్తం పూల తివాచీ పరిచినట్లు...  చూడగానే హృయదానికి అత్తుకుంటుంది. పదిహేను లక్షలకు పైగా సుమాలు విరబూసాయి. ఏప్రిల్ దాటితే ఎండవేడిమికి సుమ సోయగాలు తగ్గుతాయి. అందుకే ఇప్పటి నుంచే పర్యాటక సందడి. 


ఈ ఏడాది మూడున్నర లక్షల కొత్త మొక్కలు తోటలో చేరాయి. మరో 25 కొత్త వెరైటీ పూల మొక్కలను హాలాండ్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒకవైపు ఉగ్రవాదదాడులు, అఫ్జల్ గురు ఉరి తదనంతరం తలెత్తిన ఉద్రిక్తత ఉన్నా చలికాలపు కాశ్మీరు అందాలను చూసేందుకు పర్యాటకు తరలివస్తున్నారు. అక్కడి సర్కారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. కేవలం ఫ్లోరికల్చర్ కోసం ఇద్దరు మంత్రులున్నారంటేనే ప్రభుత్వానికి ఎంత శ్రద్దో తెలుస్తోంది. డాల్ సరస్సులో... హౌస్ బోటులో...షికారు చేస్తూ తులిప్ అందాలను ఆస్వాదించడమూ అదృశ్టమే....





No comments: