Sunday 10 March 2013

మీడియాకు పట్టని ధార్మిక వైభవం

భక్తకోటికి వందనం! 

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక ఉత్సవం అలహాబాద్ మహా కుభమేళా శివరాత్రి పర్వదినంతో పరిసమాప్తమైంది. జనవరి 14న మకర సంక్రాంతి రోజున గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో మకర స్నానాలతో ఈ అద్భుత పర్వం ఆరంభమైంది. అయితే 55 రోజుల పాటు ఇంత వైభవంగా సాగిన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా  పెద్దగా ఫోకస్ ఇవ్వనేలేదు.

భక్త జన సంద్రంగా త్రివేణి సంగమం

కార్నివాల్ కన్నా తీసిపోయిందా...?

జర్మనీ రియో డి జనైరోలో జరిగే కార్మివాల్ అనగానే మీడియా కళ్లింత చేసుకుని చూస్తుంది. అలాగే జనానికీ చూపిస్తుంది. పారిస్ ఫ్యాషన్ షోలు, హాలీవుడ్ షూటింగ్ స్పాట్లు... ఇలా మన మీడియా ప్రాధాన్యాలే వేరు. ఈ వేలంవెర్రిలో అలహాబాద్ మహాకుంభమేళా కవరేజ్ అనుకున్నంతగా లేకపోయింది.

జనజీవనంలో నాగా సాధువుల అలౌకికానందం!

ఇది హిందూ ధార్మిక వైభవం

పన్నెండు పుష్కరాలకోసారి అంటే 144 ఏళ్లకు వచ్చిన హిందూ ధార్మిక మహోత్సవం అలహాబాద్ మహా కుంభమేళా. జనవరి14 న ఏకంగా మూడు కోట్ల మంది త్రివేణి సంగమంలో మకర స్నానాలు చేశారు. ఆ తర్వాత జనవరి 25 పుష్య ఫౌర్ణమి, ఫిబ్రవరి 6 ఏకాదశి, 10 మౌని అమావాస్య, 15 వసంత పంచమి, 17 రథ సప్తమి, 18 భీష్మాష్టమి, మార్చి 25 మాఘ పౌర్ణమి, మార్చి 10 మహా శివరాత్రి... ఇలా వేటికవే పర్వదినాలు. ఒక్క మౌని అమావాస్య రోజున తొక్కిసలాట మినహా అంతా ప్రశాంతంగానే సాగింది. ఈ 55 రోజుల్లో సుమారు 12 కోట్ల మంది భక్తులు అలాహాబాద్ వచ్చారని అంచనా. సుమారు ఏడు లక్షల తాత్కాలిక శిబిరాలతో ఏర్పాటు చేసిన కుంభనగర్లో ఓంకార నాదం ఇలా ఇలా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.

నాగా సాధువులే హైలైట్

సాధువులు, సంతులు, ఆధ్యాత్మికవేత్తలు, మత గురువులు, భక్తులు, టూరిస్టులు... ఇలా దేశవిదేశాల నుంచి కోట్ల మంది భక్తులు సందర్శించారు. దిగంబరంగా తిరిగే నాగా సాధువులు మేళాలో హైలైట్. ఇందులో మహిళలు కూడా ఉండడం విశేషం. ఇలాగే 13 హిందూ అకాడాలకు చెందిన పెద్దలంతా ఊరేగింపులు, భజనలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లారు. మేళా జరిగినన్నాళ్లూ ఇక్కడే ఉండి యజ్ఞయాగాలు చేసిన కల్పవాసులదో ప్రత్యేకత. వైభవంగా జరగడమే కాదు, ఎంతో భక్తిభావం నిండిన ఈ ఉత్సవంపై అధ్యయనం చేయడానికి విదేశాల నుంచి వేల మంది వచ్చారు. ముఖ్యంగా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఏకంగా 16 బృందాలు పూర్తికాలం అధ్యయనం జరిపాయి. ధార్మిక ఉత్సవంగా కాకుండా దీన్నో మతపరమైన కార్యక్రమంగా చూసిన మన మీడియాకు మాత్రం నిరాసక్తత.





సకల పాపహరణం... త్రివేణి సంగమ 'షాహీ'స్నానం!

గంగా, యమున, అంతర్వాహిణిగా సరస్వతి నదుల సంగమం అలహాబాద్. దేవదానవులకు క్షీరసాగర మథనం సందర్భంగా జరిగిన తోపులాటతో ఈ త్రివేణి సంగమ విశిష్టతకు బంధం ఉంది.ఈ తోపులాటలో అమృత భాండం ఒలికిపోయినప్పుడు అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయినీ, నాసిక్ ప్రాంతాల్లో అమృత బింధువులు పడ్డాయిట. అందుకే ఈ నదీ ప్రవాహాలు ఇంతటి పవిత్రతను పుణికిపుచ్చుకున్నాయని పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రివేళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఆ భోళాశంకరుడికి జలాభిషేకాలు చేయడంతో 55 రోజుల పవిత్ర కార్యం పరిసమాప్తమైంది. 

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం 

ఉర్వారుకమివబంధనాత్ మృత్యోర్ముకీయ మామృతాత్ 

(ఇది మృత్యుంజయ మంత్రం. శివుడ్ని తలచుకుని ఈ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే దీర్ఘవ్యాధులు, అపమృత్యు భయాలు, మానసిక ఆందోళనలు దూరమవుతాయి. 'ఓం నశ్వివాయ'

 



4 comments:

Saahitya Abhimaani said...

Media is highly prejudiced against Hindu religion, despite the fact that it is full of people with Hindu Religious names. It is a great fashion for some Hindus, especially those in media, to act as if they do not have religion. If there is even a slightest item which can be portrayed against Hindu Religion, these people will pounce on it and show it highly magnified with vengeance.

This kind of odd mindset a behavior acting against one's own religion is yet to be analyzed by Psychiatrists.

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

మహా మాఘి నాడు అలహాబాద్ లో వున్నాను. మీరు అన్నట్లు ఒక్క మౌని అమావాస్య రోజు తప్ప.మిత రోజులు అన్ని కూడా చాల బాగా ఏర్పాట్లు చేసారు. ఒక్కరు కూడా అ పవిత్రసంగం లో మునిగి పోలేదు. కొన్ని లక్షలమంది వచ్చారు .కొంచెం కూడా తోపులాట లేదు. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీరు అన్నట్లు వేరే ఏమైనా అయితే అదే సెన్సేషనల్ అయతే వాళ్ళు నిరంతర ప్రసారం చేసే వారు. Visit web magazine at www.sirakadambam.com ఇందులో నా వ్యాసం(7th page nundi) మహాకుంభమేళ గురుంచి రాసాను.వీలు అయతే చదవండి. ధన్యవాదాలు

KAPPAGANTU RADHAKRISHNA said...

మన స్వదేశి మీడియా వారి కళ్ళుపడకపోవటమే మంచిది. లేకపోతె.. ఈ పాటికి అవాకులు చవాకులు పేలేవారు. వీరికన్నా విదేశి మీడియానే నయం. మనమంటే కాస్త గౌరవం చూపిస్తారు.

nihar said...

సర్వశ్రీ శివరామ ప్రసాదు కప్పగంతు, పూర్వఫల్గుణి, రాధాకృష్ణ కప్పగంతు గార్లకు...
నా బ్లాగు చదివి స్పందించినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి అనేక సామాజిక అంశాల మీద మెయిన్ స్ట్రీమ్ మీడియా చర్చకు పూకుకోదు. చర్చించాల్సిన అవసరం ఉన్నా ఆ బాధ్యత తీసుకోదు. సోషల్ మీడియాలోనైనా మీలాంటి విజ్ఞుల కారణంగా అంతోఇంతో చర్చ జరగడం అభిలషణీయం. నా బ్లాగు చదువుతూ మీ అభిప్రయాలను తప్పకుండా పంచుకుంటారని ఆశిస్తున్నాను. పూర్వ ఫల్గుణి గారు శిరాకదంబంలో రాసిన మహా కుంభమేళా ఆర్టికల్ బాగుంది. అభినందనలు.
మరోసారి కృతజ్ఞతలతో...
-నిహార్, బ్లాగర్